• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 22-06-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)  

1. జీఎస్టీ పాలక మండలి సమావేశం
దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన 53వ జీఎస్టీ పాలక మండలి సమావేశం జరిగింది. రైల్వే ప్లాట్‌ఫాం టికెట్లతోపాటు విద్యా సంస్థల బయట ఉండే ప్రైవేటు హాస్టళ్లను జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

2. జ్యోతి త్రయం.. హ్యాట్రిక్‌ స్వర్ణం
భారత మహిళల కాంపౌండ్‌ జట్టు పోటీపడ్డ టోర్నీల్లో రాణిస్తూ ఎదురొచ్చిన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్‌ కౌర్‌ త్రయం దూసుకెళ్తోంది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

3. తీస్తా నదీజలాలపై భారీ ప్రాజెక్టు 
భారత్‌-బంగ్లాదేశ్‌ చిరకాల మైత్రిని పరిపుష్టం చేసుకునేరీతిలో ఇరు దేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తీస్తా నదీజలాలను పరిరక్షించుకుని వినియోగించుకునేలా భారీ ప్రాజెక్టు నిర్మాణం సహా వేర్వేరు రంగాల్లో సహకారానికి అంగీకారం కుదిరింది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

4. అమరరాజాకు ‘గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌’ పురస్కారం
ఉద్యోగులు పని చేయడానికి ఉత్తమ పరిశ్రమగా తమ సంస్థకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావడం సంతోషంగా ఉందని అమరరాజా ఎనర్జీ, మొబిలిటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హర్షవర్ధన గౌరినేని తెలిపారు. ‘ది గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌’ ఇన్‌స్టిట్యూట్‌నిర్వహించిన అధ్యయనంలో తిరుపతి జిల్లాలోని కరకంబాడి సంస్థకు దేశంలో పని చేయడానికి ప్రసిద్ధి చెందిన ఉత్తమ పరిశ్రమల జాబితాలో 68వ ర్యాంకు దక్కిందన్నారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

5. ఎన్‌టీఏ ప్రక్షాళనకు ఇస్రో మాజీ ఛైర్మన్‌ అధ్యక్షతన కమిటీ
ఇస్రో మాజీ ఛైర్మన్‌ కె.రాధాకృష్ణన్‌ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో జాతీయ పరీక్ష సంస్థ (ఎన్‌టీఏ) సంస్కరణల కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇటీవల నిర్వహించిన నెట్, నీట్‌ ప్రశ్నపత్రాలు లీకైన నేపథ్యంలో ఎన్‌టీఏను సంస్కరించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.