* జూన్ 23న 1563 మంది అభ్యర్థులకు మళ్లీ పరీక్ష
ఈనాడు ప్రతిభ డెస్క్: ఎంబీబీఎస్, బీడీఎస్.. ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)- యూజీ 2024లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తిన వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నీట్ (NEET) ఫలితాల్లో 1563 మంది అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను (Grace marks) తొలగిస్తామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వారికి మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని చెప్పింది. ఈ మేరకు 1563 మంది అభ్యర్థుల అడ్మిట్కార్డులను ఎన్టీఏ విడుదల చేసింది. సంబంధిత విద్యార్థులకు జూన్ 23న పరీక్ష నిర్వహించి ఈ నెల 30వ తేదీలోగా వారి ఫలితాలను ప్రకటిస్తామని తెలిపింది.
నీట్ రీఎగ్జామ్ అడ్మిట్కార్డుల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.