• facebook
  • whatsapp
  • telegram

UGC NET 2024: పరీక్షల నిర్వహణకు ఎన్‌టీఏ కొత్త తేదీల ప్రకటన

*  పెన్ను, పేపర్‌కు బదులుగా కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష 


దిల్లీ: ఇటీవల కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన యూజీసీ నెట్‌ 2024 (UGC NET 2024) పరీక్షకు సంబంధించి కొత్త తేదీలను జాతీయ పరీక్షల సంస్థ (NTA) ప్రకటించింది. ఆగస్టు 21, సెప్టెంబర్‌ 4 మధ్య ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఎన్టీఏ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇక సీఎస్‌ఐఆర్‌ నెట్‌ (CSIR NET) పరీక్షను జులై 25-27 మధ్య, ఎన్‌సెట్‌ (NCET) పరీక్షను జులై 10న నిర్వహించనున్నట్లు తెలిపింది. అంతకుముందు నిర్వహించిన పెన్ను, పేపర్‌కు బదులుగా ఈ సారి కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆల్‌ ఇండియా ఆయుష్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ పరీక్ష (AIAPGET) 2024ను షెడ్యూల్‌ ప్రకారమే జులై 6న నిర్వహించనున్నారు.

జూనియర్‌ రిసెర్చ్‌ ఫెల్లోషిప్‌కు అర్హత సాధించడానికి, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ఎన్టీఏ ఈ ఏడాది నిర్వహించిన యూజీసీ నెట్‌లో అక్రమాలు జరిగాయంటూ నివేదిక రావడంతో కేంద్రం ఆ పరీక్షను రద్దు చేసింది. మొత్తం దేశవ్యాప్తంగా 317 నగరాల్లోని 1,205 సెంటర్లలో పెన్ను-పేపర్‌ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షకు 11 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. రెండు షిఫ్ట్‌ల్లో నిర్వహించిన పరీక్షలో అక్రమాలు జరిగాయని  కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పని చేసే భారతీయ సైబర్‌ నేర విచారణ సమన్వయ కేంద్రానికి (ఐసీసీసీసీ) చెందిన జాతీయ సైబర్‌ నేర హెచ్చరికల విశ్లేషణ విభాగం యూజీసీకి నివేదిక ఇచ్చింది. దీంతో పారదర్శకత, విశ్వసనీయత కోసం ఈ పరీక్షను రద్దు చేస్తున్నామని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది.


పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.