ఈనాడు, అమరావతి: ఓట్ల లెక్కింపు, 144 సెక్షన్ అమలు కారణంగా పాలిసెట్ కౌన్సెలింగ్లో మార్పులు చేసినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జూన్ 2 వరకు ఉన్న ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియలో ఎలాంటి మార్పూ లేదని, జూన్ 3న నిర్వహించాల్సిన దాన్ని ఆరో తేదీకి మార్పు చేశామని పేర్కొన్నారు. జూన్ 7 నుంచి 10 వరకు కళాశాలలు, కోర్సులకు వెబ్ ఐచ్ఛికాల నమోదు చేసుకోవచ్చని సూచించారు. జూన్ 11న ఐచ్ఛికాల మార్పునకు అవకాశం ఉంటుందని, 13న సీట్ల కేటాయింపు పూర్తి చేస్తామని తెలిపారు. జూన్ 14-19 వరకు కళాశాలల్లో చేరాల్సి ఉంటుందని, తరగతులు 14 నుంచే ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.