‣ పరీక్షకు 30 నిమిషాల ముందే గేట్లు మూసివేత
ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్టుడే: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నేతృత్వంలో నిర్వహించనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష-2024ను జూన్ 16వ తేదీన నగరంలోని 25 కేంద్రాల్లో నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో యూపీఎస్సీ పరిశీలకుడు సుబ్రహ్మణ్యంతో కలిసి ఏర్పాట్లపై జూన్ 14న సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విజయవాడలోని పరీక్షా కేంద్రాల్లో మొత్తం 11,112 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. ఆ రోజు ఉదయం 9.30 నుంచి ఉదయం 11.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుందన్నారు. 25 మంది సూపర్ వైజర్లు, 25 మంది రూట్ అధికారులను నియమించినట్లు వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీటీవీలతో పాటు, జామర్లను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షకు 30 నిమిషాల ముందే గేట్లు మూసివేయాలి. జేసీ పి.సంపత్ కుమార్, డీఆర్వో వి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Study Material
‣ Polity
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.