* జులై 11న ఎంపికైన విద్యార్థుల తుది జాబితా విడుదల
నూజివీడు పట్టణం, న్యూస్టుడే: ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి విద్యార్థుల దరఖాస్తులను జులై ఒకటి నుంచి పరిశీలిస్తామని ఆర్జీయూకేటీ అడ్మిషన్స్ కన్వీనర్ ఆచార్య ఎస్.అమరేంద్రకుమార్ తెలిపారు. నూజివీడులోని కళాశాల ఆవరణలో జూన్ 28న ఆయన విలేకరులతో మాట్లాడారు. జూన్ 25తో దరఖాస్తుల సమర్పణకు గడువు ముగిసిందని పేర్కొన్నారు. మొత్తం 53,863 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. అందులో ప్రభుత్వ పాఠశాలల నుంచి 34,154, ప్రైవేటు స్కూళ్ల నుంచి 19,671, ఇతర రాష్ట్రాల నుంచి 38 మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. వీరిలో అమ్మాయిలు 30,857, అబ్బాయిలు 23,006 మంది ఉన్నారని తెలిపారు. దరఖాస్తులను నూజివీడు క్యాంపస్లో పరిశీలిస్తారన్నారు. క్యాంపస్ల వారీగా ఎంపికైన విద్యార్థుల తుది జాబితాను జులై 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.