* దరఖాస్తు గడువు జులై 24
ఈనాడు-ప్రతిభ: కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్) పరీక్ష-2024కు సంబంధించిన ప్రకటనను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) సోమవారం (జూన్ 24) విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేస్తారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. టైర్-1, టైర్-2 తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో జూన్ 24 నుంచి జులై 24 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్/ అక్టోబర్లో రాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.