* అందుబాటులో హాల్టికెట్లు
* దరఖాస్తు చేసుకున్న 1,61,877 మంది విద్యార్థులు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో మే 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనున్న పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 1,61,877 మంది హాజరుకానున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు ఉంటాయన్నారు. విద్యార్థులను ఉదయం 8.45 నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని వెల్లడించారు. హాల్టికెట్లను విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా వెబ్సైట్లో ఉంచామని తెలిపారు. మే 24, 25, 27 తేదీల్లో మొదటి, ద్వితీయ, తృతీయ భాషా సబ్జెక్టులు, 28, 29, 30, 31 తేదీల్లో గణితం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, సాంఘికశాస్త్రం పరీక్షలు ఉంటాయని.. జూన్ 1, 3 తేదీల్లో ఓఎస్ఎస్ పేపర్-1, 2 నిర్వహిస్తున్నామని వివరించారు.
Download SSC Advanced Supplementary Examinations Halltickets May-2024
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.