• facebook
  • whatsapp
  • telegram

SSC Supply Exams: 24 నుంచి ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు   

* అందుబాటులో హాల్‌టికెట్లు

* దరఖాస్తు చేసుకున్న 1,61,877 మంది విద్యార్థులు

​​​​​​​

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో మే 24 నుంచి జూన్‌ 3 వరకు నిర్వహించనున్న పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు 1,61,877 మంది హాజరుకానున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు ఉంటాయన్నారు. విద్యార్థులను ఉదయం 8.45 నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని వెల్లడించారు. హాల్‌టికెట్లను విద్యార్థులు నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలుగా వెబ్‌సైట్‌లో ఉంచామని తెలిపారు. మే 24, 25, 27 తేదీల్లో మొదటి, ద్వితీయ, తృతీయ భాషా సబ్జెక్టులు, 28, 29, 30, 31 తేదీల్లో గణితం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, సాంఘికశాస్త్రం పరీక్షలు ఉంటాయని.. జూన్‌ 1, 3 తేదీల్లో ఓఎస్‌ఎస్‌ పేపర్‌-1, 2 నిర్వహిస్తున్నామని వివరించారు.

 

  Download SSC Advanced Supplementary Examinations Halltickets May-2024  


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.