మల్టీ జోన్-2లో ఉపాధ్యాయుల ప్రమోషన్లకు రంగం సిద్ధం
![]() |
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో మల్టీ జోన్-1లో ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చిన సర్కారు.. మల్టీ జోన్-2లోనూ టీచర్ల కల నెరవేర్చే ప్రక్రియ చేట్టింది. వచ్చే వారం రోజుల్లో మరో 8 వేల మందికి పదోన్నతులు దక్కనున్నాయి. మొత్తానికి ఈ నెలాఖరుకు బదిలీలు, పదోన్నతులు పూర్తి చేసి, బోధనపై దృష్టి పెట్టాలని విద్యాశాఖ భావిస్తోంది.
మల్టీ జోన్-1లోని 19 జిల్లాల్లో ఇటీవలే 10,083 మందికి స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ)గా పదోన్నతులు లభించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ జోన్లో 11,950 మందికి పదోన్నతులు దక్కాల్సి ఉండగా రోస్టర్ పాయింట్ల ప్రకారం అర్హులైన వారు లేకపోవడంతో పూర్తిగా భర్తీ కాలేదని విద్యాశాఖ వర్గాలు స్పష్టంచేశాయి. గతేడాదే ఈ జోన్లో 1250 మంది గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు (జీహెచ్ఎం)గా పదోన్నతులు పొందారు.
ఇక మల్టీ జోన్-2లో గతేడాది 147 మంది స్కూల్ అసిస్టెంట్లు జీహెచ్ఎంలుగా పదోన్నతి పొందారు. అలానే జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలకు చెందిన 769 మంది స్కూల్ అసిస్టెంట్లు ఇటీవల జీహెచ్ఎంలుగా పదోన్నతి పొందారు. తాజాగా సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. వారు వివిధ సబ్జెక్టుల్లో స్కూల్ అసిస్టెంట్లుగా, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (పీఎస్హెచ్ఎం)గా మారనున్నారు. భాషా పండితులు లాంగ్వేజ్ ఎస్ఏలుగా, పీఈటీలు ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్గా పదోన్నతులు పొందనున్నారు. మొత్తం మీద మల్టీ జోన్-2లో 8 వేల మంది ప్రయోజనం పొందనున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.