ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సొసైటీలో జులై 18న జరగాల్సిన నాన్టీచింగ్ స్టాఫ్ కౌన్సెలింగ్ షెడ్యూలు వాయిదా పడింది. సొసైటీలో జులై 15 నుంచి పదోన్నతులు, బదిలీల షెడ్యూలు మొదలైంది. తొలిరోజు జరగాల్సిన జేఎల్, పీజీటీ పోస్టుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ జులై 16న సాయంత్రం వరకు కొనసాగింది. దీంతో జులై 16న జరగాల్సిన టీజీటీ, కాంట్రాక్టు రెగ్యులరైజేషన్, రిక్వెస్ట్ బదిలీలు వాయిదా పడ్డాయి. జులై 17న సెలవు రోజు కావడంతో ప్రత్యేక టీచర్ల బదిలీలు కొనసాగలేదు. దీంతో జులై 18న ప్రకటించిన నాన్టీచింగ్ స్టాఫ్ షెడ్యూలును వాయిదా వేసినట్లు ఉద్యోగులకు సొసైటీ సమాచారం పంపించింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆర్థిక రంగ నిపుణులకు ఆహ్వానం!
‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!
‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.