• facebook
  • whatsapp
  • telegram

TET : టెట్‌ పేపర్-1లో 67.13%, పేపర్-2లో 34.18% ఉత్తీర్ణత

* ఒక్క క్లిక్‌తో టెట్‌ రిజల్ట్‌
* అర్హులకు ఉచితంగా డీఎస్సీ దరఖాస్తుకు అవకాశం 

ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET 2024) ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా రిజల్ట్స్‌ వెల్లడయ్యాయి. మే 20 నుంచి జూన్‌ 2 వరకు జరిగిన ఈ పరీక్ష ప్రాథమిక కీని ఇటీవల విడుదల చేసిన విద్యాశాఖ అధికారులు.. ఫలితాలను సిద్ధం చేశారు. టెట్‌ పేపర్‌-1కు 85,996 మంది, పేపర్‌-2కు 1,50,491మంది హాజరయ్యారు. ఈ ఫలితాల్లో కొత్తగా ఉత్తీర్ణులైన వారికి డీఎస్సీ రాసే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం. పేపర్-1లో 57,725 మంది అభ్యర్థులు, పేపర్-2లో 51,443 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో అర్హత సాధించిన వారు 67.13%. పేపర్-2లో అర్హత సాధించిన వారు 34.18%. 2023తో పోలిస్తే పేపర్-1లో 30.24% అర్హత శాతం పెరిగింది. 20023తో పోలిస్తే పేపర్-2లో 18.88% అర్హత శాతం పెరిగింది. టెట్-2024లో అర్హత సాధించని అభ్యర్థులకు వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటును ప్రభుత్వం కల్పించింది. టెట్-2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఫలితాలను https://results.eenadupratibha.net/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.


  తెలంగాణ టెట్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి  

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.