* జులై 5 నుంచి పరీక్షలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీతోపాటు ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ తదితర కోర్సుల్లో చేరేందుకు నిర్వహిస్తున్న సీపీగెట్కు ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు జూన్ 17 (సోమవారం)తో ముగియనుందని కన్వీనర్ ఆచార్య పాండురంగారెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 52 వేల మంది దరఖాస్తు చేశారన్నారు. రసాయన, జంతు, వాణిజ్య(కామర్స్) శాస్త్రాలకు ఒక్కో దానికి నాలుగు వేలకుపైగా దరఖాస్తులు అందాయన్నారు. అభ్యర్థులు ఆలస్య రుసుం లేకుండానే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. జులై 5న పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
Post Graduate Entrance Tests - 2024 Website
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.