* ప్రశాంతంగా పరీక్ష నిర్వహణ
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్ష జూన్ 9 ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రశాంతంగా జరిగింది. 895 పరీక్ష కేంద్రాల్లో ఓఎంఆర్ పద్ధతిలో ఈ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మంది పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రశ్నపత్రం కఠినంగానే ఉందని పలువురు అభ్యర్థులు తెలిపారు. గత ఐదేళ్ల కాలానికి సంబంధించిన జనరల్ అంశాలపై ఎక్కువ ప్రశ్నలు అడిగారు. సుధీర్ఘ ప్రణాళికతో సన్నద్ధమైన అభ్యర్థులే ప్రిలిమ్స్ ఉత్తీర్ణులు కాగలరని నిపుణులు పేర్కొంటున్నారు. త్వరలోనే ప్రిలిమ్స్ కీ, ఫలితాలు విడుదల కానున్నాయి.
టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రం, కీ కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.