* అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహణ
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణలో గ్రూప్-1 ప్రధాన పరీక్ష (Mains) తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఖరారు చేసింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. పరీక్షలు హైదరాబాద్ (హెచ్ఎండీఏతో సహా) పరిధిలో జరగనున్నాయి. మొత్తం 563 గ్రూప్-1 పోస్టులకు గాను 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమ్స్కు రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాల్ని ఏర్పాటు చేయగా, 3.02 లక్షల మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. ప్రతి పేపర్కు మూడు గంటల వ్యవధితో పాటు 150 మార్కులు కేటాయించారు.
పరీక్ష తేదీ | సబ్జెక్టు |
అక్టోబర్ 21 | జనరల్ ఇంగ్లిష్(క్వాలిఫైయింగ్ టెస్ట్) |
అక్టోబర్ 22 | పేపర్-1(జనరల్ ఎస్సే) |
అక్టోబర్ 23 | పేపర్-2(హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ) |
అక్టోబర్ 24 | పేపర్-3(ఇండియన్ సొసైటీ, కాన్స్టిస్ట్యూషన్ అండ్ గవర్నెన్స్) |
అక్టోబర్ 25 | పేపర్-4(ఎకానమీ, డెవలప్మెంట్) |
అక్టోబర్ 26 | పేపర్-5(సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్) |
అక్టోబర్ 27 | పేపర్-6(తెలంగాణ మూవ్మెంట్, స్టేట్ ఫార్మేషన్) |
తెలంగాణ గ్రూప్-1 ప్రధాన పరీక్షల తేదీల వివరాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.