* అభ్యంతరాలకు గడువు జూన్ 17
.
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణలో గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష (Mains) కీతో పాటు మాస్టర్ ప్రశ్నపత్రాన్ని జూన్ 13న విడుదల చేయనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వెల్లడించింది. ఈ అవకాశం జూన్ 17వరకు ఉంటుంది. కీపై అభ్యంతరాలు జూన్ 13 నుంచి 17 వరకు ఆన్లైన్లో తెలియజేయాల్సి ఉంటుంది. మొత్తం 563 గ్రూప్-1 పోస్టులకు గాను 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమ్స్కు రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాల్ని ఏర్పాటు చేయగా, 3.02 లక్షల మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.