• facebook
  • whatsapp
  • telegram

TGPSC Group1 Result: అతి త్వరలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు

* దాదాపు పూర్తయిన ఓఎంఆర్‌ పత్రాల ఇమేజింగ్‌ 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలంగాణలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష (Prelims) ఫలితాల వెల్లడికి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) సమాయత్తమవుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్‌-1 పోస్టులకు జూన్‌ 9న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఓఎంఆర్‌ పత్రాల ఇమేజింగ్‌ దాదాపు పూర్తయింది. త్వరలోనే తుది కీ విడుదల చేసి, అతి త్వరలో ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెల్లడించేందుకు కమిషన్‌ ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూలు ప్రకారం అక్టోబరులో ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు కనీసం మూడు నెలల గడువు ఉండేలా ప్రిలిమినరీ ఫలితాలను వెల్లడించాలని, ఆ మేరకు ప్రధాన పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులకు సమయం లభిస్తుందని భావిస్తోంది. ప్రిలిమ్స్‌కు రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాల్ని ఏర్పాటు చేయగా, 3.02 లక్షల మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే.

అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు మెయిన్స్‌

గ్రూప్‌-1 ప్రధాన పరీక్ష (Mains) తేదీలను ఇటీవల టీజీపీఎస్సీ ఖరారు చేసింది. అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. పరీక్షలు హైదరాబాద్‌ (హెచ్‌ఎండీఏతో సహా) పరిధిలో జరగనున్నాయి. ప్రతి పేపర్‌కు మూడు గంటల వ్యవధితో పాటు 150 మార్కులు కేటాయించారు.
 

పరీక్ష తేదీ సబ్జెక్టు  
అక్టోబర్‌ 21 జనరల్‌ ఇంగ్లిష్‌(క్వాలిఫైయింగ్‌ టెస్ట్‌)
అక్టోబర్‌ 22     పేపర్‌-1(జనరల్‌ ఎస్సే)
అక్టోబర్‌ 23 పేపర్‌-2(హిస్టరీ, కల్చర్‌, జాగ్రఫీ)
అక్టోబర్‌ 24    పేపర్‌-3(ఇండియన్‌ సొసైటీ, కాన్‌స్టిస్ట్యూషన్‌ అండ్‌ గవర్నెన్స్‌)
అక్టోబర్‌ 25 పేపర్‌-4(ఎకానమీ, డెవలప్‌మెంట్‌) 
అక్టోబర్‌ 26 పేపర్‌-5(సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌) 
అక్టోబర్‌ 27      పేపర్‌-6(తెలంగాణ మూవ్‌మెంట్‌, స్టేట్‌ ఫార్మేషన్‌) 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.