• facebook
  • whatsapp
  • telegram

TGRTC Recruitment: ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు

* సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ వెల్లడి
 

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సుల్లో గతంలో రోజుకు 45 లక్షల మంది ప్రయాణిస్తే మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తరువాత ఆ సంఖ్య సగటున 55 లక్షలకు పెరిగిందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని 2 వేల కొత్త డీజిల్‌ బస్సులు, 990 ఎలక్ట్రిక్‌ బస్సులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయన్నారు. అందుకనుగుణంగా 3 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు బస్‌భవన్‌లో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో 56,604 మంది ఆర్టీసీ ఉద్యోగులు 29 రోజులపాటు సకలజనుల సమ్మె చేసి కీలకపాత్ర పోషించారన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు రవీందర్, విజయపుష్ప, రాజశేఖర్, శ్రీధర్, ఉషాదేవి, విజయభాస్కర్, పాల్గొన్నారు.


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.