ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రాథమిక విద్య అస్తవ్యస్తంగా మారిందని.. మంత్రి నారా లోకేశ్ పరిస్థితులను చక్కదిద్దాలని ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ప్రసాద్ కోరారు. విజయవాడలో జులై 10న వారిద్దరూ విలేకర్లతో మాట్లాడారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా 4,457 ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత బడుల్లో విలీనం చేశారు. 1, 2 తరగతులతో మిగిలిన వాటిలో విద్యార్థులు చేరడం లేదు. ఈ ఏడాది సుమారు 20 వేల పాఠశాలల్లో 10, 15 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. 750 బడుల్లో ఒక్కరూ చేరలేదు. ప్రవేశాలు తగ్గడం చూస్తే భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితి కనిపిస్తోంది’’ అని వివరించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ వినూత్న కెరియర్కు.. మాలిక్యులర్ జెనెటిక్స్!
‣ కొలువులు కురిపించే కంప్యూటర్ మేఘం!
‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు
‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.