* జులై 19 నుంచి తరగతులు ప్రారంభం
ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్కు కన్వీనర్ నవ్య శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. జులై 1 నుంచి 7వ తేదీ వరకు ప్రాసెసింగ్ ఫీజు, రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జులై 4 నుంచి 10 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 8-12 వరకు కోర్సులు, కళాశాలల ఎంపిక కోసం ఐచ్ఛికాల నమోదుకు అవకాశం ఇచ్చారు. 13న ఐచ్ఛికాల మార్పు, 16న సీట్ల కేటాయింపు చేయనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు 17-22లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. జులై 19 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని కన్వీనర్ ప్రకటించారు. ఫార్మసీ ప్రవేశాలకు ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.