* త్వరలో కౌన్సెలింగ్ తేదీలు వెల్లడి
ఎ.ఎన్.యు., న్యూస్టుడే: న్యాయ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ లాసెట్ ఫలితాలను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రెక్టార్ ఆచార్య వరప్రసాదమూర్తి జూన్ 27న విడుదల చేశారు. మొత్తం 19,224 మంది పరీక్ష రాయగా 17,117 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని కన్వీనర్ ఆచార్య సత్యనారాయణ తెలిపారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి రాగానే కౌన్సెలింగ్ తేదీలను వెల్లడిస్తామన్నారు. మూడేళ్ల లా కోర్సులో తిరుపతి జిల్లాకు చెందిన యామల కృష్ణ చైతన్య 104 మార్కులు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన హర్షవర్ధన్ రాజు 103, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చెల్లుబోయిన రేవంత్రాయ్ 98 మార్కులతో తొలి మూడు స్థానాలు సాధించారు. ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సులో కుసుమ అగర్వాల్ (విజయనగరం జిల్లా) 92, విజయనందిని (తెలంగాణలోని మల్కాజ్గిరి జిల్లా) 91, విజయ ఆదిత్య (ఎన్టీఆర్ జిల్లా) 88 మార్కులు సాధించారు. రెండేళ్ల పీజీ విభాగంలో అభినీత్ జాసన్ (కృష్ణా జిల్లా) 96 మార్కులు, నూకల దీప్తి (గుంటూరు జిల్లా) 95, నువ్వుల జాహ్నవి (ఎన్టీఆర్ జిల్లా) 94 మార్కులతో తొలి మూడు ర్యాంకులు సాధించారు.
ఏపీ లాసెట్-2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఏపీ లాసెట్-2024 ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.