• facebook
  • whatsapp
  • telegram

Latest News: 27-03-2024  తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1.  Polyset: 1 నుంచి ఉచిత పాలీసెట్‌ శిక్షణ

ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఉచిత పాలీసెట్‌ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్సారార్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ కె.భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


2. Exams: 22న ఆర్మీలో సోల్జర్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ పరీక్ష

ఇండియన్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ 2024-25లో సోల్జర్‌ కేటగిరి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల అభ్యర్థులకు ఏప్రిల్‌ 22న ఆన్‌లైన్‌లో ఉమ్మడి ప్రవేశపరీక్ష జరగనుందని జిల్లా స్టెప్‌ సీఈవో కె.వెంకటేశ్వర్లు  మార్చి 26న ఓ ప్రకటనలో తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


3. Exams: మే 1 నుంచి బీఈడీ పరీక్షలు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో మే 1 నుంచి బీఈడీ నాలుగో సెమిస్టర్‌ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


4. Group-1: గ్రూపు 1 దరఖాస్తుల సవరణకు 27 తుది గడువు

టీఎస్‌పీఎస్సీ గ్రూపు-1 దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు కల్పించిన గడువు మార్చి 27న సాయంత్రం 5 గంటలకు ముగియనుందని కమిషన్‌ కార్యదర్శి......

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


5. SEBI: సెబీలో 97 ఆఫీసర్ల పోస్టులు

క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) ఈ ఏడాది వివిధ విభాగాల్లో 97 మంది ఆఫీసర్లను నియమించుకోవాలని భావిస్తోంది. తన నియంత్రణ బాధ్యతలను వేగంగా, మరింత ప్రభావవంతంగా పూర్తి చేసేందుకు ఈ పోస్టులు అవసరమని తెలిపింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.