* మంత్రి డి.శ్రీధర్బాబు డిమాండ్
* గ్రూప్-2, 3లలో పోస్టుల పెంపుపై క్యాబినెట్లో చర్చిస్తామని వెల్లడి
హైదరాబాద్, న్యూస్టుడే: ‘నీట్’ నిర్వహణలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ చేయించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘నీట్ నిర్వహణ, ఫలితాల అంశంలో లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగింది. జూన్ 14న ఫలితాలు రావాల్సి ఉన్నా.. జూన్ 4న అదీ ఎన్నికల ఫలితాల రోజే విడుదల చేయడం, గ్రేస్ మార్కులు కలపడం, 67 మందికి తొలి ర్యాంకు రావడంపై అనుమానాలకు తావిస్తోంది. జీఓ 46పై ఆందోళన వద్దు. అందరికీ న్యాయం చేస్తాం. గ్రూప్-1 మెయిన్స్పై నోటిఫికేషన్లో ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ముందుకెళతాం. లేదంటే మళ్లీ న్యాయ సమస్యలు వచ్చే ప్రమాదముంది. గ్రూప్-2, 3ల పోస్టుల పెంపు డిమాండ్పై... క్యాబినెట్లో చర్చిస్తాం. అందరి ఆలోచనలకు అనుగుణంగానే సీఎం రేవంత్రెడ్డి జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తారు’’ అని శ్రీధర్బాబు వివరించారు.
మరింత సమాచారం...మీ కోసం!
♦ ఎన్సీబీ, ఫరీదాబాద్లో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్
♦ ఈఎస్ఐసీ, అల్వార్లో 115 ఫ్యాకల్టీ పోస్టులు
♦ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.