* జూన్ 30 నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు
![]() |
జూబ్లీహిల్స్, న్యూస్టుడే: స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) ఆధ్వర్యంలో భర్తీ చేసే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లు టీ-శాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్రెడ్డి శనివారం (జూన్ 29) ఓ ప్రకటనలో తెలిపారు. సుమారు 17,727 సీజీఎల్ పోస్టులకు సంబంధించి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అవగాహన కల్పించేందుకు జూన్ 30 నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు ప్రత్యక్ష ప్రసారం ఉంటుందన్నారు. పరీక్షలు రాసే అభ్యర్థులు 040-23556037, 040-23540726 నంబర్లను లేదా టోల్ ఫ్రీ నంబరు 1800 425 4039లను సంప్రదించాలని సూచించారు. ఎస్ఎస్సీ సీజీఎల్ ఉద్యోగాల భర్తీకి జూన్ 24న నోటిఫికేషన్ విడుదల కాగా, అక్టోబరులో ప్రిలిమ్స్, డిసెంబరులో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఎస్సీ ప్రకటించిందన్నారు. ఈ పరీక్షలు ముగిసేంత వరకూ రోజూ గంట పాటు పాఠాలను ప్రసారం చేస్తామని ఆయన పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.