• facebook
  • whatsapp
  • telegram

Engineering counselling: ఇంజినీరింగ్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌లో 86% సీట్ల భర్తీ

ఒక రోజు ఆలస్యంగా విడుదలైన  సీట్ల కేటాయింపు ఫలితాలు 

ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్‌ ప్రవేశాల మొదటి విడత కౌన్సెలింగ్‌లో 85.71% సీట్లు భర్తీ అయ్యాయి. ప్రైవేటు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో కలిపి కన్వీనర్‌ కోటాలో మొత్తం 1,36,660 సీట్లు ఉండగా.. 1,17,136 నిండాయి. ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు ఫలితాలను కన్వీనర్‌ నవ్య జులై 17న విడుదల చేశారు. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జులై 16న ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉండగా.. ఒక రోజు ఆలస్యమైంది. ఈ సమాచారాన్ని అర్ధరాత్రి వరకు వెబ్‌సైట్‌లో పెట్టకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కంప్యూటర్ల ముందు పడిగాపులు కాయాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 24 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోని కళాశాలల్లో 6,877 సీట్లకు గాను 6,189 నిండాయి. ప్రైవేటు కళాశాలల్లో 1,21,951 సీట్లు ఉండగా.. 1,03,247 భర్తీ అయ్యాయి. ప్రైవేటు వర్సిటీల్లో 7,832 సీట్లకు 7,700 నిండాయి. 


రిజిస్ట్రేషన్‌కు 57 వేల మంది దూరం..

ఈఏపీసెట్‌ ఎంపీసీ స్ట్రీమ్‌లో 1,86,031 మంది అర్హత సాధించగా, అందులో 1,28,619 మంది కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత 1,28,065 మంది అర్హత సాధించగా.. వీరిలో 1,26,608 మంది వెబ్‌ ఐచ్ఛికాలు నమోదు చేసుకున్నారు. 

క్రీడల కోటా, ఎన్‌సీసీ కేటగిరీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి కానందున వీరికి సీట్లు కేటాయించలేదు. ప్రతిసారీ సకాలంలో ధ్రువపత్రాల పరిశీలన పూర్తి కాలేదంటూ మొదటి విడతలో సీట్లు కేటాయించకపోవడం పరిపాటిగా మారింది. క్రీడా కోటాలో 609, ఎన్‌సీసీలో 1,217 మంది అభ్యర్థులు ఉన్నారు. 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆర్థిక రంగ నిపుణులకు ఆహ్వానం!

‣ జాబ్‌ మార్కెట్‌లో ఏఐ జోరు!

‣ పాఠాలు అర్థం కావడం లేదా?

‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!

‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.