ఈనాడు - అమరావతి: రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ)లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏను తీవ్ర నిర్లక్ష్యం చేయడమే కాకుండా, ఉన్న వారినీ సాగనంపి నిర్వీర్యం చేసింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతి పునర్మిర్మాణంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో పనులు వేగవంతం చేసేందుకు అవసరమైన పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కార్యాలయంలో వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి కోరుతూ సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ జులై 10న పురపాలక శాఖకు లేఖ రాశారు. దీనికి ఆమోదం తెలుపుతూ.. మూడేళ్ల కాలపరిమితితో 75 పోస్టులను ఒప్పంద, 68 పోస్టులు పొరుగుసేవల పద్ధతిలో నింపేందుకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ జీవో జారీ చేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆర్థిక రంగ నిపుణులకు ఆహ్వానం!
‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!
‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.