* రూ.5కోట్లు అందజేయనున్న అదానీ గ్రూపు సంస్థలు
* భద్రంగా విద్యార్థులు, ఆచార్యుల పరిశోధనలు
ఈనాడు, హైదరాబాద్: అత్యాధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానంతో విద్యార్థులకు బోధన అందిస్తున్న జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్టీయూ హైదరాబాద్) సొంతంగా డేటా కేంద్రాన్ని సమకూర్చుకోనుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అందజేయనున్న రూ.5కోట్ల విరాళంతో ఈ కేంద్రం ఏర్పాటు కానుంది. ఇప్పటి వరకు ఐఐటీ మద్రాస్లో మాత్రమే డేటా సెంటర్ ఉందని రిజిస్ట్రార్ డాక్టర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. హైదరాబాద్ క్యాంపస్ సహా విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలలు, ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థులు, ఆచార్యులు సంయుక్తంగా చేసిన పరిశోధనలు, చేస్తున్న అధ్యయనాల వివరాలన్నీ డేటా కేంద్రంలో భద్రంగా ఉంటాయన్నారు.ఈ కేంద్రాన్ని అదానీ కనెక్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది.కేంద్రం నిర్వహణ, శిక్షణ వ్యవహారాలను ఆచార్యులు, విద్యార్థులకు ఆ సంస్థ ప్రతినిధులు నేర్పిస్తారు.
* పరిశోధనలు... సారూప్యతలు... విద్యార్థులు, ఆచార్యులు వేర్వేరుగా, సంయుక్తంగా వివిధ విభాగాల్లో పరిశోధనలు చేస్తున్నారు. సివిల్, మెకానికల్, ఇంజినీరింగ్ వంటి సంప్రదాయ విభాగాలతో పాటు కంప్యూటర్ సైన్స్, డేటాసైన్స్, సైబర్ భద్రత, కృత్రిమ మేధ వంటి అంశాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ జేఎన్టీయూలో విద్యార్థులకు వచ్చిన ఆలోచనలు.. ఇతర వర్సిటీల్లో చదువుకుంటున్న వారికీ వచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ రెండు పరిశోధనల మధ్య సారూప్యతలుంటే ముందుగా పరిశోధన చేసిన వారికే ప్రాధాన్యం ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులను డేటా సెంటర్ ద్వారా అధిగమించవచ్చని జేఎన్టీయూ మంజూర్ హుస్సేన్ పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఫుట్వేర్ తయారీలో శిక్షణ ఇలా..
‣ ఉక్కు సంస్థలో ఉన్నత ఉద్యోగాలు
‣ సివిల్స్ మౌఖిక పరీక్షకు మౌలిక సూచనలు
‣ డిప్లొమాతో ఎన్టీపీసీలో అవకాశాలు
‣ ఫర్నిచర్ డిజైన్ కెరియర్ గైడెన్స్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.