* ఉపాధ్యాయ నియామక పరీక్ష
ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) దరఖాస్తుల్లో ఫిబ్రవరి 12 నుంచి 14వరకు ఈడబ్ల్యుఎస్ కోటా రిజర్వేషన్ లేకుండానే ప్రభుత్వం స్వీకరించింది. దీనిపై అభ్యర్థులు ఫిర్యాదులు చేయడంలో ఫిబ్రవరి 15 నుంచి ఈడబ్ల్యుఎస్ ఐచ్ఛికాన్ని తీసుకొచ్చింది. దీంతో ముందు దరఖాస్తు చేసిన ఓసీలు ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ను కోల్పోయారు. దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం కుదరదని, కావాలంటే మళ్లీ రూ.750 చెల్లించి, దరఖాస్తు చేసుకోవాలని అధికారులు అంటున్నారని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రభుత్వం చేసిన తప్పునకూ తమనే బాధ్యులను చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల్లోనే 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, చాలామందికి ఈ కోటాకు అర్హత ఉందని చెబుతున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!
‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..
‣ ట్రెండింగ్ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్!
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.