* హైకోర్టు ఆదేశం
ఈనాడు, హైదరాబాద్: విద్యుత్ శాఖలో మిగిలిపోయిన 553 జేఎల్ఎం పోస్టులను పరీక్షలకు హాజరైన వారిలో మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్ఎస్పీడీసీఎల్)ను హైకోర్టు ఆదేశించింది. జేఎల్ఎం నియామకాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు, స్థానికత వర్తించదని వ్యాఖ్యానించింది. స్తంభాలు ఎక్కే పరీక్ష నిర్వహించి వారితో పోస్టులను భర్తీ చేయాలని, వారు లేనిపక్షంలో పరీక్ష నిర్వహించి ఖాళీలను భర్తీ చేయాలని స్పష్టం చేసింది. 2019లో టీఎస్ఎస్పీడీసీఎల్ జేఎల్ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు పోస్టులను భర్తీ చేయడాన్ని సవాల్ చేస్తూ జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన ఉప్పరి తిరుమలేశ్తోపాటు మరికొందరు హైకోర్టులో 2020లో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి ఫిబ్రవరి 29న తీర్పు వెలువరించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్రెడ్డి, న్యాయవాదులు సుంకర చంద్రయ్య, చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. రాష్ట్రపతి ఉత్తర్వులను జేఎల్ఎం పోస్టులకు వర్తింపజేయలేరని, మిగిలిన ఖాళీలను మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని ఆదేశించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ట్రెండింగ్ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్!
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ ఆరు మెట్లతో ఆఫర్ లెటర్ అందుకోండిలా!
‣ వాయిదా వేస్తే.. వెనుకపడ్డట్లే!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.