ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఐటీఐ, పాలిటెక్నిక్ల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వీటిలో అడ్మిషన్లు భారీగా తగ్గాయని, పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, బుచ్చయ్యచౌదరి, ఆనందరావు, కూన రవికుమార్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఐటీఐల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.44 కోట్లు, పాలిటెక్నిక్లకు రూ.50 కోట్లు అవసరముంది. దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ముందుకు వెళతాం. అవసరానికి అనుగుణంగా ఐటీఐ, పాలిటెక్నిక్లను ఏర్పాటు చేస్తా’ అని తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి
‣ పవర్ గ్రిడ్లో 435 ఇంజినీర్ ట్రెయినీ ఉద్యోగాలు
‣ తీర రక్షక దళంలో నావిక్, యాంత్రిక్ కొలువులు