చండీగఢ్: పోలీసుశాఖతోపాటు అటవీ గార్డులు, జైలు వార్డెన్ల ఉద్యోగాల్లో అగ్ని వీరులకు 10శాతం కోటా ఇవ్వనున్నట్లు హరియాణా ప్రభుత్వం ప్రకటించింది. ఆ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భాజపా ప్రభుత్వం ఈ హామీ ఇవ్వడం గమనార్హం. ఎవరైనా అగ్నివీర్ సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని భావిస్తే రూ.5 లక్షల వరకూ వడ్డీలేని రుణం కూడా ఇస్తామని ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రకటించారు. ‘కానిస్టేబుళ్లు, మైనింగ్ గార్డులు, అటవీ గార్డులు, జైలు వార్డెన్లు, ప్రత్యేక పోలీసు అధికారుల నియామకాల్లో 10శాతం రిజర్వేషన్లను అగ్నివీరులకు ఇస్తాం’ అని ఆయన వెల్లడించారు. గ్రూప్ సీ, డీ పోస్టుల్లో మూడేళ్ల వయోపరిమితి సడలింపు కూడా ఇస్తామని జులై 17న చండీగఢ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. అగ్నివీరులకు ఉద్యోగాలిచ్చే పరిశ్రమలకు సబ్సిడీలనూ ఇస్తామని వెల్లడించారు. అగ్ని వీరులకు ఆయుధ లైసెన్సుల జారీలో ప్రాధాన్యమిస్తామని చెప్పారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆర్థిక రంగ నిపుణులకు ఆహ్వానం!
‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!
‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.