* పరీక్ష సమయం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు
వరంగల్ విద్యావిభాగం, న్యూస్టుడే: జూన్ 3 నుంచి 11వ తేదీ వరకు జరిగే పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డి.వాసంతి మే 28న తెలిపారు. జిల్లాలో అన్ని సబ్జెక్టుల నుంచి 806 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. వీరి కోసం వరంగల్ చింతల్బ్రిడ్జి సమీపంలోని ప్లాటినం జూబ్లీ హైస్కూల్లో పాఠశాలలో ఏ, బీ, రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. సంబంధిత వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 89199 74862 సంప్రదించాలని సూచించారు.
♦ TS TENTH CLASS SUPPLEMENTARY STUDY MATERIAL
♦ TS TENTH CLASS GENERAL STUDY MATERIAL
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!
‣ డేటాసైన్స్తో ఉద్యోగ అవకాశాలు!
‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!
‣ ఇంటర్తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.