నూజివీడు పట్టణం, న్యూస్టుడే: ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ప్రాంగణాల్లో ప్రవేశాలకు సంబంధించిన తుది జాబితాను గురువారం నూజివీడులో కులపతి ఆచార్య కేసీ రెడ్డి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘2024-25 విద్యా సంవత్సరం ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు 53,863 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో ప్రాంగణానికి 1,000 సీట్లతో పాటు ఈడబ్ల్యూఎస్ కోటా కింద అదనంగా వంద సీట్లు కలిపి 4 ప్రాంగణాలను 4,400 మందితో భర్తీ చేస్తున్నాం. వీరిలో 85% మంది ఆంధ్ర విద్యార్థులు, 15% ఓపెన్ మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులకు కేటాయించాం. భర్తీ చేసిన సీట్లలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 92.99%, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు 7.01% ఉన్నారు. వీరికి ఈ నెల 22, 23 తేదీల్లో నూజివీడు ప్రాంగణంలో, 22, 23-ఇడుపులపాయ, 26, 27-శ్రీకాకుళంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తాం. ఒంగోలులో ఈ నెల 24, 25వ తేదీల్లో జరగాల్సిన కౌన్సెలింగ్ను ఇడుపులపాయలో నిర్వహించనున్నాం’ అని వివరించారు. పూర్తి వివరాలు ఆర్జీయూకేటీ వెబ్సైట్ ఉన్నాయని ప్రవేశాల సమన్వయకర్త అమరేంద్ర కుమార్ తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ టెన్త్ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!
‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!
‣ కెరియర్ ఖజానా... నైపుణ్యాల నజరానా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.