‣ మరో విడత కౌన్సెలింగ్కు అవకాశం!
ఈనాడు, హైదరాబాద్: పాలిసెట్ చివరి విడత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత 8,748 సీట్లు ఖాళీగా ఉన్నాయి. చివరి విడత సీట్లను సాంకేతిక విద్యాశాఖ అధికారులు శుక్రవారం కేటాయించారు. మొత్తం 114 కళాశాలల్లో 29,610 సీట్లు అందుబాటులో ఉండగా...వాటిల్లో 20,862 (70.46 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన వారు జులై 15లోపు ఫీజు చెల్లించి.. 16వ తేదీలోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన సూచించారు. అలాట్మెంట్ లెటర్లో పేర్కొన్న విధంగా ధ్రువపత్రాలను అందజేయాలని తెలిపారు. జులై 18 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
మరో విడత కౌన్సెలింగ్?
పలు కళాశాలల యాజమాన్యాలు కొన్ని బ్రాంచీల్లో సీట్లను తగ్గించుకొని డిమాండ్ ఉన్న బ్రాంచీల్లో సీట్లను పెంచుకునేందుకు (కన్వర్షన్) దరఖాస్తు చేసుకున్నాయి. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. దాంతో దాదాపు 3 వేల సీట్లు పెండింగ్లో పడ్డాయి. వాటికి ఆమోదం తెలిపితే మరో విడత కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశముంది. చివరి విడత సీట్ల కేటాయింపు తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్కు షెడ్యూల్ ఇస్తారు. ఈసారి ఇంకా ఇవ్వకపోవడానికి అదే కారణమని తెలుస్తోంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!
‣ టెన్త్ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!
‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.