ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రవేశాలకు మార్చి 12 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమగ్రశిక్షాభియాన్ ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు. 2024-25 సంవత్సరానికి 6, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలతో పాటు.. 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు చేసుకోవాలని మార్చి 8న ఓ ప్రకటనలో సూచించారు. అనాథలు, బడి మానేసిన పిల్లలు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 18004258599 నంబరులో సంప్రదించాలన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఉద్వేగాల నియంత్రణ.. ఉద్యోగాలకు సాధన
‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.