ఈనాడు, హైదరాబాద్: ఒకే రోజు రెండు సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డీఎస్సీ పరీక్షలు ఉంటే...అలాంటి వారు ఉదయం పరీక్ష రాసిన చోటే రెండో పరీక్షకు హాజరుకావచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఆ విషయాన్ని అధికారులు అభ్యర్థులకు సమాచారమిచ్చారు. కొందరు అభ్యర్థులకు ఉదయం ఒక జిల్లాలో.. మధ్యాహ్నం మరో జిల్లాలో పరీక్షలు ఉన్నాయి. నాన్లోకల్ పోస్టులకు దరఖాస్తు చేయడంతో ఇతర జిల్లాల్లో పరీక్షా కేంద్రాలిచ్చారు. దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. స్పందించిన విద్యాశాఖ అధికారులు అలాంటి వారు ఒకే రోజు ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాసే అవకాశమిస్తామని తెలిపారు. వారికి హాల్టికెట్లు మార్చి ఇస్తామని అధికారి ఒకరు చెప్పారు.ఒక సబ్జెక్టు తెలుగు, అదే సబ్జెక్టు హిందీ మాధ్యమానికి దరఖాస్తు చేసి ఉంటే ప్రధాన మాధ్యమంలో వచ్చిన మార్కులను రెండో దానికి కూడా పరిగణనలోకి తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టంచేసింది. జులై 18 నుంచి ఆన్లైన్ విధానంలో డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!
‣ టెన్త్ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!
‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.