• facebook
  • whatsapp
  • telegram

Exams: నేటి నుంచి ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు

* ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 

వరంగల్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ ఎండీ అబ్దుల్‌ హై తెలిపారు. జూన్‌ 3 నుంచి 11 వరకు పరీక్షలు ఉంటాయని చెప్పారు. జిల్లాలో అన్ని సబ్జెక్టుల నుంచి 868 మంది విద్యార్థులు రాయనున్నారని పేర్కొన్నారు. వీరి కోసం వీరి కోసం హనుమకొండ లష్కర్‌ బజార్‌లోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందని చెప్పారు. ఒక సూపరింటెండెంట్, ఒక డిపార్ట్‌మెంటల్‌ అధికారితో పాటు  సిట్టింగ్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణలో అధికారులు, సిబ్బంది, విద్యార్థులు అవకతవకలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్ణీత సమయానికి ఐదు నిమిషాలు ఆలస్యమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొన్నారు. ఏమైనా ఇబ్బందులుంటే డీఈవో కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.  




 ♦ TS TENTH CLASS SUPPLEMENTARY STUDY MATERIAL 


♦ English Medium  


♦ Telugu Medium 


 ♦ TS TENTH CLASS GENERAL STUDY MATERIAL 
 

♦ English Medium 


♦ Telugu Medium  


♦ Previous Papers  


♦ Model Papers 
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పోటీ ప్రపంచంలో డేటా విశ్వరూపం!

‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!

‣ టెక్స్‌టైల్‌ కమిటీలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ కొలువులు!

‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫార్మసీ కోర్సులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.