ఈనాడు, హైదరాబాద్: నిరుద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించి పెద్దఎత్తున అరెస్టులు చేయడాన్ని సీపీఎం ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ఎక్కువ శాతం డీఎస్సీ అభ్యర్థులే గ్రూప్-2, 3 పరీక్షలు రాయబోతున్నారు. ఆగస్టు 5వ తేదీతో డీఎస్సీ ముగుస్తోంది. 7, 8 తేదీల్లో గ్రూప్స్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీంతో అభ్యర్థులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కనీసం నెల రోజుల సమయం ఇవ్వాలని విద్యార్థులు కోరడంలో న్యాయం ఉంది. కానీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది’’ అని తమ్మినేని మండిపడ్డారు. గ్రూప్స్ పరీక్షల తేదీలను మార్చాలని కోరారు. మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చి కేవలం 11,062 పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం సరైంది కాదన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ టెన్త్ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!
‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!
‣ కెరియర్ ఖజానా... నైపుణ్యాల నజరానా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.