దిల్లీ: సైన్యంలో పనిచేసిన మాజీ అగ్నివీర్లకు కేంద్ర పారమిలిటరీ బలగాల్లో రిజర్వేషన్లు కల్పించనున్నట్లు సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ ప్రకటించాయి. భవిష్యత్తులో చేపట్టే కానిస్టేబుల్ నియామకాల్లో 10 శాతం మాజీ అగ్నివీరులకు రిజర్వ్ చేస్తున్నట్టు పేర్కొన్నాయి. కేంద్ర హోంశాఖ గతంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపాయి. అగ్నిపథ్ పథకం చర్చనీయాంశమైన నేపథ్యంలో సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నైనా సింగ్, బీఎస్ఎఫ్ అధిపతి నితిన్ అగర్వాల్, సీఆర్పీఎఫ్ దళపతి అనీశ్ దయాల్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. భవిష్యత్తులో చేపట్టబోయే కానిస్టేబుల్ నియామకాల్లో 10శాతం వారికి కేటాయిస్తామన్నారు. అంతేకాకుండా శారీరక సామర్థ్య పరీక్షల్లోనూ వీరికి మినహాయింపు ఉంటుందన్నారు. తొలి ఏడాది ఐదు సంవత్సరాలు, తదనంతరం మూడు సంవత్సరాల సడలింపు ఇస్తామన్నారు. త్రివిధ దళాల్లో నియామకాలకు సంబంధించి జూన్ 2022లో అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. 17 నుంచి 21 సంవత్సరాల వయసున్న యువతీ యువకులు మాత్రమే అగ్నివీర్లుగా విధులు నిర్వహించేందుకు అర్హులుగా కేంద్రం పేర్కొంది. నాలుగేళ్లు ముగిసిన అనంతరం సర్వీస్ నుంచి తప్పుకొన్న అగ్నివీర్లకు పింఛను సౌకర్యాలు ఉండవు. వారిలో 25శాతం మందిని మరో 15 ఏళ్ల పాటు రెగ్యులర్ సర్వీస్లో కొనసాగిస్తారు. ఈ పథకంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజా రిజర్వేషన్ల ప్రకటన రావడం గమనార్హం.
మరింత సమాచారం... మీ కోసం!
‣ టెన్త్ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!
‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!
‣ కెరియర్ ఖజానా... నైపుణ్యాల నజరానా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.