* మార్గదర్శకాలపై హైకోర్టు స్టే
ఈనాడు, హైదరాబాద్: మైనారిటీ గురుకులాల్లో బోధన, బోధనేతర సిబ్బంది బదిలీల నిమిత్తం ఆ శాఖ కార్యదర్శి ఈ నెల 6న జారీ చేసిన మార్గదర్శకాల అమలును ఈ నెల 18 వరకు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ గురుకుల సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ జి.హేమలత, మరికొందరు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఇటీవల జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గురుకులాల సిబ్బందిని తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సర్వీసు నిబంధనల పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం 2022 జులై 7న ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అయితే వాటిని సవాలు చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా, వాటి అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా బదిలీ మార్గదర్శకాలను జారీ చేయడం చట్ట, రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుంటూ యూనిట్ ట్రాన్స్ఫర్ కింద మార్గదర్శకాలు జారీ చేశారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. వివరణ ఇవ్వాలని గురుకులాల కార్యదర్శిని ఆదేశిస్తూ విచారణను 18కి వాయిదా వేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ టెన్త్ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!
‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!
‣ కెరియర్ ఖజానా... నైపుణ్యాల నజరానా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.