లాలాపేట, న్యూస్టుడే: పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీ ‘వన్ టైం ఛాన్స్’కు అవకాశం కల్పించింది. 2000-2001 నుంచి 2018-19 మధ్య వివిధ విద్యా సంవత్సరాల్లో ఓయూతో పాటు అనుబంధ కళాశాలల్లో చదివి సకాలంలో 4 సెమిస్టర్లు క్లియర్ చేయని విద్యార్థులకు ఈ అవకాశం ఉపయోగపడుతుంది. గతంలోని హాల్ టికెట్, మార్కుల మెమో కాపీలను జత చేసి ఆగస్టు 16 వరకు ఫీజు చెల్లించాలి. రూ.500 ఆలస్యరుసుంతో ఆగస్టు 28 వరకు చెల్లించవచ్చు. పూర్తి వివరాలకు ఓయూ పరీక్షల విభాగం గానీ, ఓయూ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!
‣ టెన్త్ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!
‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.