* ఆరు జిల్లాల్లో భారీగా పెరిగిన ఎస్జీటీ ఉద్యోగాలు
ఈనాడు, హైదరాబాద్: డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఆన్లైన్ పరీక్షలను జూన్ నెలాఖరులో ప్రారంభించాలని భావిస్తోంది. జూన్ 9వ తేదీన గ్రూపు-1 ప్రాథమిక పరీక్ష జరగనుంది. డీఎస్సీ అభ్యర్థులు దానికి కూడా పోటీపడే అవకాశం ఉండడంతో అది ముగిసిన తర్వాత కొంత సమయమిచ్చి ఈ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆన్లైన్ పరీక్షలు కావడంతో కనీసం 10 రోజులపాటు జరుగుతాయి. ఈసారి 1,016 స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను పక్కనబెట్టినా.. ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య 10,046కు చేరింది. అంటే పాత నోటిఫికేషన్(5,089)తో పోల్చుకుంటే పోస్టులు దాదాపు రెట్టింపు అయినట్లే. పోయినసారి స్కూల్ అసిస్టెంట్లలో పలు సబ్జెక్టులకు.. పలు జిల్లాల్లో పోస్టులు లేకపోవడం.. ఉన్నా 10లోపే ఉండటంతో పలువురు అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి వెనకడుగు వేశారు. ఈసారి కొత్తగా కనీసం లక్ష మంది పెరుగుతారని విద్యాశాఖ అంచనా. గతంలో వర్టికల్ రోస్టర్ పాయింట్ విధానం ఉండగా.. ఈసారి సమాంతర రోస్టర్ విధానాన్ని అమలు చేయనున్నారు. దానివల్ల జనరల్ విభాగంలో ఖాళీలు పెరగనున్నాయని, ఫలితంగా పోటీపడే వారి సంఖ్య అధికంగా ఉండనుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
టెట్ నిర్వహించిన తర్వాతే డీఎస్సీ పరీక్షలు జరపాలని పలువురు అభ్యర్థులు విన్నవిస్తున్నారు. ఐదున్నర నెలల క్రితం టెట్ నిర్వహించారని.. ఆ పరీక్షలో కూడా 84 శాతం మంది తప్పారని, మళ్లీ నిర్వహిస్తే అనేక వేల మందికి డీఎస్సీ అవకాశం లభిస్తుందని వివరిస్తున్నారు. దీనిపై ఇప్పటికే అధికారులకు వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. కేంద్ర విద్యాశాఖ ప్రతి ఆరు నెలలకు ఒకసారి సెంట్రల్ టెట్ జరుపుతోంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ విదేశీ కొలువు కల.. సాకారం ఇలా!
‣ గ్రూప్-1 ప్రిలిమ్స్ తుది సన్నద్ధత! (ఏపీపీఎస్సీ)
‣ గ్రూప్-1 ప్రిపరేషన్ ప్లాన్ (టీఎస్పీఎస్సీ)
‣ ‘ట్రిపుల్ ఆర్’తో ఒత్తిడిని చిత్తు చేద్దాం!
‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!
‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..
‣ ట్రెండింగ్ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.