కరీంనగర్ క్రీడా విభాగం, న్యూస్టుడే: కరీంనగర్, హకీంపేట, ఆదిలాబాద్ తెలంగాణ క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి బి.శ్రీకాంత్రెడ్డి తెలిపారు. మూడో తరగతిలో ఉత్తీర్ణత సాధించి నాలుగో తరగతిలో ప్రవేశాలు పొందే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి ఇలా విద్యార్థులను మూడు దశలో ఎంపిక చేస్తారని చెప్పారు. అనంతరం మూడు క్రీడా పాఠశాలల్లో అర్హతను బట్టి ప్రవేశాలు కల్పిస్తారన్నారు. మండల స్థాయి ఎంపిక పోటీలు జూన్ 21 నుంచి 25 వరకు నిర్వహిస్తున్నట్లు, విద్యార్థులు ఆయా మండలాల్లోని ఎంఈవో కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. జిల్లా స్థాయి ఎంపిక పోటీలు జూన్ 27న ఉదయం 8.00 గంటల నుంచి కరీంనగర్లోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ స్టేడియంలో జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. ఎంపిక పోటీల్లో పాల్గొనే విద్యార్థులు జనన ధ్రువపత్రం (01.09.2015 నుంచి 31.08.2016) సమర్పించాలని తెలిపారు. 4వ తరగతి చదువుతున్న స్టడీ సర్టిఫికెట్తో ఎంపిక పోటీలకు రావాలని సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ వినూత్న కెరియర్కు.. మాలిక్యులర్ జెనెటిక్స్!
‣ కొలువులు కురిపించే కంప్యూటర్ మేఘం!
‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు
‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.