* ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్
ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో 42.54% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 1,33,591 మంది పరీక్షలు రాయగా.. 56,836 మంది పాసయ్యారు. ఫలితాలను మంత్రి నారా లోకేశ్ బుధవారం ‘ఎక్స్’ వేదికగా విడుదల చేశారు. బాలుర కంటే బాలికలే ఎక్కువ మంది పాసయ్యారు. బాలురు 72,508 మంది పరీక్షలు రాయగా.. 29,047 (40%) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 61,083 మంది పరీక్షలకు హాజరు కాగా.. 27,789 (45%) మంది పాసయ్యారు. మార్కుల మెరుగుదలకు రాసిన విద్యార్థుల్లో 79% మందికి మార్కులు పెరిగాయి. పబ్లిక్ పరీక్షలు, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ కలిపి మొదటి ఏడాది ఉత్తీర్ణులైన వారి సంఖ్య 80 శాతానికి పెరిగింది. ఈ సప్లిమెంటరీ ఫలితాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా 67 శాతంతో మొదటి స్థానంలో నిలవగా.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా 31 శాతంతో అట్టడుగున నిలిచింది.
రీవెరిఫికేషన్ 28 నుంచి..
జవాబు పత్రాల రీవెరిఫికేషన్కు జూన్ 28 నుంచి జులై 4 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది. ఒక్కో సబ్జెక్టుకు రూ.వెయ్యి చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించాలని పేర్కొంది. షార్ట్ మెమోలను జులై ఒకటి నుంచి వెబ్సైట్లో ఉంచనున్నట్లు వెల్లడించింది.
ఏపీ ఇంటర్ ప్రథమ సంవత్సర సప్లిమెంటరీ ఫలితాలు
‣ General |
‣ Vocational |
What Next After Intermediate?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.