* ఉన్నత విద్యామండలి ఛైర్మన్ రాజీనామాతో ప్రతిష్టంభన
ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్ ఫలితాల విడుదలలో ఉన్నత విద్యామండలి తీవ్ర జాప్యం చేస్తోంది. దీంతో దాదాపు 3 లక్షల మంది విద్యార్థులకు నిరీక్షణ తప్పడం లేదు. ఎన్నికల్లో వైకాపా ఓడిపోవడంతో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పదవికి హేమచంద్రారెడ్డి.. కొన్ని కీలకమైన దస్త్రాలను మాయం చేసిన అనంతరం రాజీనామా చేశారు. ప్రభుత్వం లేనందున రాజీనామాను ఆమోదించడం కుదరదని, కావాలంటే సెలవులో వెళ్లాలని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు సూచించడంతో హేమచంద్రారెడ్డి మెడికల్ లీవ్లో వెళ్లారు. ఇన్ఛార్జి ఛైర్మన్ బాధ్యతలను వైస్ ఛైర్మన్ రామమోహన్రావుకు అప్పగించారు. ఈఏపీసెట్ ఫలితాలు విడుదలలో కావాలనే జాప్యం చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే ఈఏపీసెట్ ఫలితాలు విడుదల చేసి, కౌన్సెలింగ్కు సిద్ధమవుతున్నారు. ఇక్కడ ప్రవేశపరీక్ష పూర్తయి, ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ కూడా పూర్తి చేశారు. మరోవైపు ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు విడుదల చేయాలని విద్యార్థుల నుంచి డిమాండ్ పెరుగుతున్నా ఎలాంటి నిర్ణయం ప్రకటించడం లేదు. ఛైర్మన్ లేనందున ఫలితాల విడుదలపై ఇన్ఛార్జి ఛైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.
మరింత సమాచారం...మీ కోసం!
♦ నైపుణ్యాల ప్రయాణం ఇలా విజయవంతం!
♦ బీఎస్ఎఫ్లో ఇన్స్పెక్టర్ పోస్టులు
♦ ఎన్సీబీ, ఫరీదాబాద్లో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్
♦ ఈఎస్ఐసీ, అల్వార్లో 115 ఫ్యాకల్టీ పోస్టులు
♦ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.