• facebook
  • whatsapp
  • telegram

EAPSET: ఈఏపీసెట్‌ ఫలితాలు ఎప్పుడు?

* ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ రాజీనామాతో ప్రతిష్టంభన

ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌ ఫలితాల విడుదలలో ఉన్నత విద్యామండలి తీవ్ర జాప్యం చేస్తోంది. దీంతో దాదాపు 3 లక్షల మంది విద్యార్థులకు నిరీక్షణ తప్పడం లేదు. ఎన్నికల్లో వైకాపా ఓడిపోవడంతో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పదవికి హేమచంద్రారెడ్డి.. కొన్ని కీలకమైన దస్త్రాలను మాయం చేసిన అనంతరం రాజీనామా చేశారు. ప్రభుత్వం లేనందున రాజీనామాను ఆమోదించడం కుదరదని, కావాలంటే సెలవులో వెళ్లాలని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు సూచించడంతో హేమచంద్రారెడ్డి మెడికల్‌ లీవ్‌లో వెళ్లారు. ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ బాధ్యతలను వైస్‌ ఛైర్మన్‌ రామమోహన్‌రావుకు అప్పగించారు. ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదలలో కావాలనే జాప్యం చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల చేసి, కౌన్సెలింగ్‌కు సిద్ధమవుతున్నారు. ఇక్కడ ప్రవేశపరీక్ష పూర్తయి, ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ కూడా పూర్తి చేశారు. మరోవైపు ఏపీలో ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల చేయాలని విద్యార్థుల నుంచి డిమాండ్‌ పెరుగుతున్నా ఎలాంటి నిర్ణయం ప్రకటించడం లేదు. ఛైర్మన్‌ లేనందున ఫలితాల విడుదలపై ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. 

 

       మరింత సమాచారం...మీ కోసం!        
 

నైపుణ్యాల ప్రయాణం ఇలా విజయవంతం!  

బీఎస్‌ఎఫ్‌లో ఇన్‌స్పెక్టర్ పోస్టులు

ఎన్‌సీబీ, ఫరీదాబాద్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ 

ఈఎస్‌ఐసీ, అల్వార్‌లో 115 ఫ్యాకల్టీ పోస్టులు 

రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

నలుగురితో కలిసిపోవాలంటే...

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.