* జులై 19న మౌఖిక పరీక్షలు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని పశువైద్యశాలల్లో జాతీయ పశువైద్యమండలి (వీసీఐ) తనిఖీల నేపథ్యంలో పాలకమండలి తాత్కాలిక నియామకాలను చేపట్టింది. ఒప్పంద ప్రాతిపదికన 17 మంది బోధన సిబ్బంది నియామకాల కోసం విశ్వవిద్యాలయం దరఖాస్తులను ఆహ్వానించింది. 2024-25 విద్యాసంవత్సరానికి రాజేంద్రనగర్, కోరుట్ల, మామునూరు పశువైద్య కళాశాలలు, పెబ్బేరులోని మత్స్యకళాశాలకు ప్రవేశానుమతి కోసం వీసీఐ బృందం ఏ క్షణమైనా తనిఖీకి వచ్చే అవకాశం ఉందనే సమాచారం ఉందని, సిబ్బంది కొరత ఇతర లోపాలు బయటపడకుండా ఒప్పంద ప్రాతిపదికన తాత్కాలిక నియామకాలు చేపట్టాలని ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. దీనికి ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు రాజేంద్రనగర్లో ముగ్గురు, కోరుట్లలో అయిదుగురు, మామునూరులో ఆరుగురు, పెబ్బేరులో ముగ్గురు బోధన నిపుణుల నియామకాల కోసం విశ్వవిద్యాలయం దరఖాస్తులను ఆహ్వానించింది. జులై 19న వారికి మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నారు. నెట్ అర్హత గల బోధన నిపుణులకు రూ.43,470, నెట్ అర్హత లేని వారికి రూ.37,800 చొప్పున నెలసరి వేతనాలు ఇస్తామని విశ్వవిద్యాలయం పేర్కొంది. నియామకాలు పూర్తిగా తాత్కాలికమని, సరైన పనితీరు లేకపోతే నోటీసు ఇవ్వకుండానే తొలగిస్తామని పేర్కొంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ క్లర్క్ కొలువు సాధనతో సులువు!
‣ కొచ్చిన్ షిప్యార్డ్లో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు!
‣ గ్రూపు-1 మెయిన్స్ 100 రోజుల వ్యూహాం!
‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.