ఈనాడు, హైదరాబాద్: ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు బుధవారం కౌన్సెలింగ్ మొదలైంది. రాజేంద్రనగర్లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ కౌన్సెలింగ్ను రిజిస్ట్రార్ పి.రఘురామిరెడ్డి ప్రారంభించారు. ‘పాలిసెట్ - 2024’లో 455 ర్యాంకు పొందిన అరియాజరీన్కు జగిత్యాలలోని వ్యవసాయ పాలిటెక్నిక్లో ప్రవేశం కల్పిస్తూ ధ్రువపత్రాలను అందజేశారు. పాలిసెట్లో 690 ర్యాంకు సాధించిన బి.లోకేశ్ నల్గొండ జిల్లా కంపసాగర్లోని వ్యవసాయ పాలిటెక్నిక్లో ప్రవేశం కల్పించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ జులై 12 వరకు మొదటి విడత కౌన్సెలింగ్ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ విభాగం డైరెక్టర్ జమునా రాణి, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రవణ్కుమార్, సహ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ బీటెక్, బీఎస్సీ అర్హతతో కొలువులు!
‣ క్రీడల్లో కోచ్లుగా రాణించాలుకుంటున్నారా?!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.