• facebook
  • whatsapp
  • telegram

Gurukuls: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం  

బాలసముద్రం, న్యూస్‌టుడే: గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు 2024-25 విద్యాసంవత్సరానికి గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ విద్యాలయాల సంస్థ వరంగల్‌ రీజినల్‌ కోఆర్డినేటర్‌ ఎస్‌.విద్యారాణి తెలిపారు. బాలసముద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో డిసెంబరు 29న ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ శాఖల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ గురుకుల పాఠశాలలు నెలకొల్పి విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజన వసతులు కల్పిస్తోందన్నారు. ఆంగ్ల, తెలుగు మాధ్యమాల గురుకులాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. అర్హులైన విద్యార్థినీ విద్యార్థులు www.tswreis.ac.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకొని ప్రవేశ పరీక్షకు హాజరు కావాలన్నారు. 2024 జనవరి 6వ తేదీ వరకు తుది గడువు ఉందన్నారు. పరీక్షకు పది రోజుల ముందు హాల్‌ టికెట్ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించాలన్నారు. ఇతర వివరాలకు 1800 425 45678 గల టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయవచ్చన్నారు. డీసీఓలు డి.ఉమామహేశ్వరి, ఆర్‌.సమ్మయ్య, జి.భిక్షపతి, జె.యాదగిరి పాల్గొన్నారు. 




 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఫుట్‌వేర్‌ తయారీలో శిక్షణ ఇలా..

‣ ఉక్కు సంస్థలో ఉన్నత ఉద్యోగాలు

‣ సివిల్స్‌ మౌఖిక పరీక్షకు మౌలిక సూచనలు

‣ డిప్లొమాతో ఎన్‌టీపీసీలో అవకాశాలు

‣ ఫర్నిచర్‌ డిజైన్‌ కెరియర్‌ గైడెన్స్‌



 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.