ఈనాడు డిజిటల్, అమరావతి: ఎడ్సెట్(బీఈడీ) తుదివిడత కౌన్సెలింగ్ ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు తుది విడత షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి కన్వీనర్ ఫిబ్రవరి 26న విడుదల చేశారు. వెబ్ కౌన్సెలింగ్ నమోదు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3 వరకు, ధ్రువపత్రాల పరిశీలన ఫిబ్రవరి 29 నుంచి మార్చి 3 వరకు జరగనుంది. వెబ్ ఐచ్ఛికాలు మార్చి 2 నుంచి 5 వరకు చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్ల మార్పు మార్చి 6, సీట్ల కేటాయింపు మార్చి 9న చేయనున్నట్లు తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు మార్చి 11 నుంచి కళాశాల్లో చేరాల్సిందిగా పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!
‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..
‣ ట్రెండింగ్ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.