దిల్లీ: దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2024-25 విద్యాసంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ - యూజీ పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఈ పరీక్షను హైబ్రిడ్ పద్ధతి (ఆన్లైన్/ఆఫ్లైన్)లో రోజుకు రెండు మూడు షిఫ్టుల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఫిబ్రవరి 27న ప్రకటించింది. కొన్ని కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), మరికొన్నింటిలో పేపర్, పెన్ను విధానంలో నిర్వహణకు నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. గతంలో మాదిరిగా 10 సబ్జెక్టులు కాకుండా ఈ సారి ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా ఆరు సబ్జెక్టుల్ని మాత్రమే ఎంచుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. సీయూఈటీ (యూజీ) పరీక్షకు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 26 వరకు ఆన్లైనులో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 26 అర్ధరాత్రి 11.50 గంటల వరకు ఆన్లైనులో ఫీజు చెల్లింపులు చేసుకోవచ్చు. ఈ పరీక్షను మే 15 నుంచి 31 మధ్య వివిధ తేదీల్లో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ తెలిపింది. తెలుగు సహా మొత్తం 13 భాషల్లో 27 సబ్జెక్టులకు ఈ పరీక్ష జరగనుంది. దేశవ్యాప్తంగా 354 పట్టణాలు, విదేశాల్లోని 26 పట్టణాల్లో పరీక్ష నిర్వహిస్తారు. జూన్ 30న ఫలితాలను విడుదల చేస్తారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ‘ట్రిపుల్ ఆర్’తో ఒత్తిడిని చిత్తు చేద్దాం!
‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!
‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..
‣ ట్రెండింగ్ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్!
‣ పర్యాటక కోర్సుల్లో ప్రవేశాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.