‣ ఈ సారి ఐఐటీ రూర్కీకి నిర్వహణ బాధ్యతలు
ఈనాడు, హైదరాబాద్: దేశంలోని ఐఐటీలు, ఇతర సంస్థల్లో ఎంటెక్లో ప్రవేశానికి నిర్వహించే ‘గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్)-2025’ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో జరగనున్నాయి. ఈసారి ఆన్లైన్ పరీక్షల నిర్వహణ బాధ్యత ఐఐటీ రూర్కీ చేపట్టింది. వెబ్సైట్ను జులై 12న అందుబాటులోకి తెచ్చింది. మొత్తం 30 సబ్జెక్టుల్లో పరీక్షలు జరగనున్నాయి. ఆగస్టు నెలాఖరులో దరఖాస్తుల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. గేట్ స్కోర్ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు సైతం పరిగణనలోకి తీసుకుంటారు. బీటెక్ విద్యార్థులు మూడో సంవత్సరం చదువుతున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి సంవత్సరం చదువుతున్న డిగ్రీ విద్యార్థులూ(బీఏ, బీకాం, బీఎస్సీ) పోటీపడవచ్చు. గేట్ స్కోర్ ద్వారా ఎంటెక్లో చేరితే నెలకు రూ.12,400ల చొప్పున స్కాలర్షిప్ అందజేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఆ స్కోర్ ఉన్నవాళ్లకు ప్రవేశాల్లో తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఐఐటీలు గేట్ స్కోర్తో నేరుగా పీహెచ్డీలో కూడా ప్రవేశాలు ఇస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో పరీక్ష నిర్వహించే ప్రాంతాలు: చీరాల, చిత్తూరు, గుంటూరు, కడప, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, అనంతపురం, కర్నూల్, ఏలూరు, కాకినాడ, సూరంపాలెం, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం
తెలంగాణలో పరీక్ష నిర్వహించే ప్రాంతాలు: హైదరాబాద్, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్
మరింత సమాచారం... మీ కోసం!
‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!
‣ టెన్త్ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!
‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.